Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వాన సంఘం అధ్యక్షులు కూరెళ్ల నర్సింహచారి
నవతెలంగాణ -రామన్నపేట
రామన్నపేట మండల కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించే డీవైఎఫ్ఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షులు కూరెల్ల నర్సింహచారి, ఆ సంఘం మండల కార్యదర్శి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ కోరారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యువత ఎదుర్కొనే సమస్యలపై చర్చించి భవిష్యత్ యువజన పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. జిల్లా మహాసభలకు యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం మహాసభల జయప్రదం కోసం ఆహ్వానసంఘం కమిటీని ఎన్నుకున్నారు.
ఆహ్వానసంఘం కమిటీ
అధ్యక్షులుగా కూరెళ్ల నర్సింహచారి, కార్యదర్శిగా ఆనగంటి వెంకటేశం, ఉపాధ్యక్షులుగా అబ్దుల్లాపురం వెంకటేశం, నాగటి ఉపేందర్, సహాయ కార్యదర్శులుగా కల్లూరి నగేష్, మునుకుంట్ల లెనిన్, ప్రచార కార్యదర్శులు బొడ్డుపల్లి వెంకటేశం, మేడి మధుబాబు, కోశాధికారి మెట్టు శ్రవణ్, సభ్యులు బడుగు రమేష్, గాదె నరేందర్, ఎర్రోళ్ళ లక్ష్మమ్మ, గుండాల భిక్షం, బీంపాక ప్రశాంత్, అంకం నరేష్, గట్టు ఉపేందర్, శానగొండ రాములను ఎన్నుకున్నారు.