Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దడిగే ఇస్తారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం ఆ పార్టీ మండల అధ్యక్షులు జోరుక ఎల్లేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పీసరి తిరుమల రెడ్డి, సీనియర్ నాయకులు చిరిగే శ్రీనివాస్, జిల్లా మోర్చ ఉపాధ్యక్షులు బైరపాక స్వామి, మండల ప్రధానకార్యదర్శి గంగారపు నరేష్, మండల కార్యదర్శి గాజుల బాలరాజు గౌడ్, మండల కార్యవర్గసభ్యులు బండి కిషన్, బిసి మోర్చ అధ్యక్షులు ఎగ్గిడి వెంకటయ్య, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు అనంతుల పాండురంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.