Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
నవతెలంగాణ - ఆలేరురూరల్
మండలంలోని మంతపురి గ్రామ సమీపంలో ఉన్న కల్వర్టు బీట్ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఆర్అండ్బీ అధికారులు కనీసం ప్రమాద సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు బీట్ రోడ్డుపై సంవత్సరం నుంచి గుంతలు ఏర్పడ్డాయి. ఆ రోడ్డు గుండా వందలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. రాత్రి వేళల్లో గుంతలు కనబడక ద్విచక్ర వాహన దారులు కింద పడి గాయపడ్డ సంఘటనలూ ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజా సంఘాల నేతుల, వాహనదారులు కోరుతున్నారు.