Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం వల్ల ప్రజా సంక్షేమానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చౌటుప్పల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వరగంటి నర్సింహా అన్నారు. శుక్రవారం ఎల్ఐసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా, ఇన్సూరెన్స్, విద్యుత్తురంగం వంటి అనేక సంస్థలను ప్రయివేటు పరం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రయివేటు పెట్టుబడిదారుల ధనదాహం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు రామచందర్, వీరలింగం, యాదగిరి, వీరయ్య, గణేశ్, అశోక్, ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు.