Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రగతి పనులను సమీక్షించేందుకు రాష్ట్ర సీఎం కేసీఆర్ సోమవారం హాలియాకు రానున్నారు. ఉదయం 10.40ని||లకు హెలికాప్టర్లో హాలియాకు చేరుకుంటారు. 11గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకుని అక్కడ జరిగే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులను సమీక్షిస్తారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ఒంటిగంటకు ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో మధ్యాహ్నాభోజనం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.