Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లాకు చెందిన ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ తన కుమార్తె ఫైజా పుట్టినరోజు సందర్భంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావును, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ నల్లమోతు సిద్దార్ధను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి ఫైజాకు మిఠాయి తినిపించి భాస్కర్రావు ఆశీర్వదించారు. కాసేపు ఫైజాతో సరదాగా ముచ్చటించారు. చిన్నతనం నుంచే బాగా కష్టపడి చదువుకొని ఉజ్వల భవిష్యత్ పొందాలని కోరారు.ఫైజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజరు కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ అదనపు కమిషనర్ షికా గోయల్, డీఐజీ బి.సుమతి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, కమిషనర్ చీమ వెంకన్న, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, విశ్రాంత డీఎస్పీ రాజేశ్వర్ రావు, ఇన్స్ పెక్టర్స్ సదా నాగరాజు, నిగిడాల సురేష్,గంగాధర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు హమీద్ షేక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, కోటేశ్వర్రావు పాల్గొన్నారు.