Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
బునాదిగాని కాల్వ ద్వారా ఆయాకట్టు కింద రైతులకు సాగునీరు అందించడమే ఎమ్మెల్యే లక్ష్యమని మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి అన్నారు. మంగళవారం మండలపరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బునాదిగాని కాల్వకు పడిన గండిని ఎమ్మెల్యే సొంత నిధులతో గండిని పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆటంకం లేకుండా సాగునీటిని అందించేందుకు ఎమ్మెల్యే అహర్నిషలు కషిచేస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలను దేవేందర్రెడ్డి, సురకంటి బాల్రెడ్డి, గూడూరు మహిపాల్రెడ్డి, సురకంటి సుధాకర్రెడ్డి, తలబోయిన జంగయ్యయాదవ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పులుగం మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.