Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ- నల్గొండ
వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారించి ఆర్థిక పురోగతిని సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా గోపాల మిత్రుల పునశ్చరణ తరగతుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యంగా జీవించడానికి అమ్మపాల తర్వాత ఆహారంతో పాటు ఆవు, గేదె పాలు మనిషికి ఎంతో ఉపయోగమన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయంతో పాటు పశు సంపద వృద్ధి చెందలేదన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగం, పాడి, పశు సంపద అభివృద్ధికి చర్యలు తీసు కుంటున్నట్టు తెలిపారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి తీసుకునే పాలు కల్తీకి గురవుతున్నట్టు తెలిపారు. ఉత్పత్తి తక్కువ, వాడకం ఎక్కువగా ఉన్నందున డిమాండ్కు అనుగుణంగా జనాభాకు సరిపడా సరఫరా లేదన్నారు. దీంతో కొందరు ఆహార ,పాల ఉత్పత్తులు కల్తీకి పాల్పడుతున్నారన్నారు. వ్యవసాయంలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. కూరగాయలు, మాంసం ఉత్పత్తులు పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. పాలు, మాంసం ఉత్పత్తులు, కూరగాయలు సాగు పై అవసరాల కనుగుణంగా దృష్టి సారించాలన్నారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా దిగుబడి అధికంగా సాధించాలన్నారు. ఆవు పాల తో ఆహార పోషక ఉత్పత్తులు, ఆవు పేడ మూత్రంతో ఎరువు తయారు చేయవచ్చన్నారు.
పాడి పరిశ్రమ పై రైతులు దృష్టి సారించాలి
నల్గొండ జిల్లాలో పునరుత్పత్తి యోగ్యమైన పాడి పశువుల సంఖ్య 5,39,406 ఉండగా కత్రిమ గర్భదారణ 3,54,127 నిర్వహించినట్టు తెలిపారు.పాడి,పశు సంపద పెంపొందించాలని,గోపాల మిత్రలు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కలిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్మ ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగు లకు రూ.8500 కనీస వేతనం ఉండేలా నిర్ణయించారన్నారు. పశు గణాభి వద్ధి సంస్థ చైర్మెన్ కోరిన విధంగా గోపాల మిత్రలకు పీఆర్సీ వర్తింపు అంశం పై పరిశీలిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా కత్రిమ గర్భదారణ పద్ధతిలో పశు సంపద వృద్ధి చెందుతున్నట్టు తెలిపారు. డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గోపాల మిత్రలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడానికి పశు గణాభి వృద్ధి సంస్థ ఆలోచించాలన్నారు. శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ అందుబాటులో వనరుల ద్వారా పశు సంపద పెంపుకు రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ సామవేశంలో పశుగణాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మెన్్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మెన్ మోతె పిచ్జి రెడ్డి, సీఈఓ మంజు వాణి, పశు సంవర్థక శాఖ జేడీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.