Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ - చిలుకూరు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. గ్రామాల్లో డెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఇంటింటి సర్వే చేసి ప్రజలకు వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం గ్రామానికి చెందిన సుడిగాలి వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆయన్ను పరామర్శించారు. రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈదయ్య, సర్పంచ్ కొడారిబాబు, డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదులు, కడియాల వెంకటేశ్వర్లు, ఎస్కె.పాషా అధికారులు పాల్గొన్నారు.