Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్నగర్
నియోజకవర్గంలోని సింగిల్ రోడ్లను డబుల్గా మార్చేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి గిరిధర్కు వినతి పత్రం అందజేసినట్టు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి - అలింగపురం డబుల్లైన్ రోడ్డుకు రూ.24 కోట్లు, గోపాలపురం - లింగగిరి రోడ్డుకు రూ.12 కోట్లు, హుజూర్నగర్ - వాకిళ్ల రోడ్డుకు రూ.13 కోట్లు, మల్లారెడ్డి గూడెం - రామాపురం రోడ్డుకు రూ.15 కోట్లు, హుజూర్నగర్ - మట్టపల్లి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.99 కోట్లు మంజూరు చేయాలని కోరినట్టు ఆయన తెలిపారు.