Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట : ఈనెల 9 క్విట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలకు నిరసనగా సెవ్ ఇండియా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం కరపత్రం విడుదల చేయడం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని సేవ్ ఇండియా పేరుతో నిరసనగా సత్యాగ్రహాలు నిర్వహిస్తున్నారని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు) జిల్లా అధ్యక్షుడు గోరిగె సోములు, నకిరేకంటి రాము, గోరిగె ఆది మల్లయ్య, సోమనర్షింహ చారి, పిట్టల శ్రీనివాసు, రాపోలు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.