Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
శిలాఫలకాన్ని యథావిధిగా ఏర్పాటు చేయాలని సింగిల్ విండో మాజీ చైర్మెన్ సత్తి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భువనగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన కార్యాలయం 2017 సెప్టెంబర్ 25న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిచే ప్రారంభించి, అప్పటి చైర్మెన్గా ఉన్న తన పేరుమీద శిలాఫలకం ఏర్పాటు చేయగా ప్రస్తుత చైర్మెన్ నోముల పరమేశ్వర్ రెడ్డి కావాలనే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని తొలగించారనితెలిపారు. మూడు సార్లు భువనగిరి సింగిల్విండో బ్యాంకు చైర్మెగా చేసిన అనుభవం ఉన్న తనను అవమానానికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలలో ఫ్లెక్సీలలో యాడ్లు ఇచ్చి అగౌరవపరచారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రస్తుత చైర్మెన్ తన వైఖరిని మార్చుకుని శిలాఫలకం యథావిధిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.