Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
అనుమతి లేని అక్రమ కట్టడాలపై ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఐజీ ఏవి.రంగ నాథ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన మున్సిపల్ కమిషనర్ లు,ఆర్డీఓలు,అగ్నిమాపక శాఖ,డీఎస్పీలు, జిల్లా టాస్క్ పోర్స్ కమిటీ, మున్సిపాలిటీ ఎన్ఫోర్స్మెంట్ బందాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అనుమతులు నిర్ణీత సమయంలో త్వరితంగా అనుమతులు మంజూరు చేసేందుక ప్రభుత్వం టీఎస్బీ పాస్ చట్టం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. అక్రమ కట్టడాలు, లే అవుట్ ల ను గుర్తించి మున్సిపాలిటీ వారీగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఎన్ఫోర్స్ మెంట్,టాస్క్ ఫోర్స్ టీమ్ లు నిబంధనల మేరకు చర్యలు,కూల్చి వేయాలని ఆదేశించారు.జిల్లా స్థాయి టాస్క్ పోర్స్ కమిటీ అక్రమ కట్టడాల పై మాన్యువల్ గా, టీఎస్బీపాస్ పోర్టల్,కాల్ సెంటర్,మొబైల్ అప్లికేషన్, ట్విట్టర్ ద్వారా వచ్జిన ఫిర్యాదులు స్వీకరించి మూడు రోజుల్లో ఫిర్యాదులు పరిశీలించాలన్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి అవసరమైతే డెమాలిషన్ స్క్వాడ్ నోటీస్ లేకుండా కూల్చి వేయాలన్నారు. అక్రమ కట్టడాలు,లే అవుట్ లపై రిజిస్ట్రేషన్ అథారిటీ కు సమాచారం అందిస్తూ నిషేధ ప్రాపర్టీ రిజిస్ట్రర్లో నమోదు చేస్తూ, తాగు నీరు సరఫరా, విద్యుత్ సరఫరా కనెక్షన్ లు ఇవ్వకుండా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేస్తుందన్నారు.