Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మండలంలోని ధర్మోజిగూడెం రెవెన్యూ పరిధిలోని ప్రసిద్ధ బయో పరిశ్రమలో గురువారం షార్ట్ సర్క్యుట్తో ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగిరి పరిశ్రమలోని బస్తాలకు అంటుకున్నాయి. దీంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం పరిశ్రమలో నిల్వ ఉన్న డ్రమ్ములకు నిప్పు అంటుకొని పేలిపోయాయి. పరిశ్రమలోని సిబ్బంది గమనించి పరిశ్రమ నుండి పరుగులు తీశారు. పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపిస్తుండడంతో చౌటుప్పల్లోని ఫైరింజన్కు సమాచారం అందించారు. ఫైరింజన్లు పరిశ్రమ వద్దకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరుగలేదు.