Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
- డీఐజీ ఏవి.రంగనాథ్
నవతెలంగాణ-నల్లగొండ
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని డీఐజీ ఏవి.రంగనాథ్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 14 రకాల వర్టీకల్స్ను అన్ని స్థాయిల పోలీస్ అధికారులు సమర్ధవంతంగా అమలయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా సమర్పించడం ద్వారా పోలీస్ అధికారుల పనితీరును రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అంచనా వేయొచ్చన్నారు. డయల్ 100కు వచ్చే ప్రతి ఫోన్కు విధిగా స్పందించడంతో పాటు సాధ్యమైనంత త్వరితంగా ఘటనా స్థలానికి చేరుకోవడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని మరింత పెంచేలా పని చేయాలన్నారు. అనంతరం పోలీస్ శాఖలో సమర్ధవంతమైన సేవలందించిన పోలీస్ అధికారులను ó్ అభినందించి వారికి పతకాలు అందజేశారు.
డీఐజీకి కతజ్ఞతలు తెలిపిన పోలీస్ అధికారుల సంఘం
జిల్లా పోలీసు శాఖలోని ఉద్యోగులకు జులై నెలల నుండి నూతన పీఆర్సీతో కూడిన వేతనం జమ అయ్యేలా చర్యలు తీసుకున్న సందర్భంగా పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి. జయరాజ్, నాయకులు సోమయ్య డీఐజీ ఏవి.రంగనాథ్కు పుష్పగుచ్ఛం అందజేసి కతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డీిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రవీందర్, రమణా రెడ్డి, సురేష్ కుమార్, సీిఐలు బాలగోపాల్, చంద్ర శేఖర్ రెడ్డి, నిగిడాల సురేష్, పి.ఎన్.డి. ప్రసాద్, ఆదిరెడ్డి, సత్యం, నాగరాజు, సత్యనారాయణ, గౌరు నాయుడు, శంకర్ రెడ్డి, రాఘవులు, వెంకటేశ్వర్లు, రౌతు గోపి, రవీందర్, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, శ్రీనివాస్, కష్ణారావు పాల్గొన్నారు.