Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
మండలకేంద్రంలోని మీసేవ కేంద్రాల్లో ఆసరా దరఖాస్తుల నమోదు తీరుపై గురువారం మీసేవ జిల్లా ఈడీఎం ఎండి.గఫార్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఈడీఎం గఫార్ మాట్లాడుతూ 57 ఏండ్లు నిండిన వారంతా ఆసరా పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని, దరఖాస్తు దారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగ మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. ఆయన వెంట డీ ఎం గౌతమ్ తదితరులు ఉన్నారు.