Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ - చిలుకూరు
ప్రధాని మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు. గురువారం మండలంలోని కొండాపురం గ్రామంలో నిర్వహించిన పార్టీ శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం పార్టీ శాఖ కార్యదర్శిగా భాష్యం లింగమయ్యను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నరసింహారావు, మండల కార్యదర్శి వెంకటేశ్వరావు, మండల కమిటీ సభ్యులు బుడిగం రామారావు, వీరస్వామి, రామారావు పాల్గొన్నారు.