Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతుబీమాకు పరిమితులు విధించడం సరికాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి విమర్శించారు.శుక్రవారం ఎంవీఎన్ భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.రైతుబీమా పొందడం కోసం 59 ఏండ్లలోపు వారే దరఖాస్తు చేసుకోవాలని పరిమితి విధించడం సరికాదన్నారు.ఎందుకంటే ఆ వయస్సు లోపు ఉన్న వాళ్ళు వ్యవసాయం గిట్టుబాటు కాక జీవనం గడవడం కోసం ప్రత్యామ్నాయ పనులు చూసుకుంటున్నారన్నారు. వ్యవసాయరంగంలో 59 ఏండ్ల వయస్సుపై బడిన వారే ఎక్కువగా పని చేస్తున్నారని పేర్కొ న్నారు.వయస్సుతో సంబ ంధం లేకుండా భూమి ఉండి, పట్టా హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు బీమాను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.59 ఏండ్లు పైబడిన రైతులకే ఎక్కువ శాతం ప్రమాదాలు సంభవించడం, అనారోగ్యానికి లాంటివి జరుగు తున్నందున ఆ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.నిజంగా వయస్సు నిబంధన పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే దాన్ని 70 ఏండ్ల వరకు పెంచాలని కోరారు. రైతాంగానికి ఈ నెల 31 వరకు మాత్రమే రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని తేదీ నిర్ణయించడం మంచిది కాదన్నారు.జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో ఏ విధంగా అయితే దరఖాస్తు చేసుకుంటారో అదే విధంగా రైతులకు వీలైనప్పుడు రైతుబీమా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.