Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వాంతన
అ సూర్యాపేట జిల్లాకేంద్రంలో పాలియోటివ్ కేర్ (స్వాంతన) కేంద్రం ఏర్పాటు
అ ప్రారంభించిన మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
అవసాన దశలో ఉన్న వారికి స్వాంతన చికిత్స కేంద్రం సేవలందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.ఈ కేంద్రంలో ఇన్ పేషేంట్లతో పాటు ఔట్ పేషేంట్లకు కుడా వైద్యసేవలు అందిస్తారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు ఎంతగానో విస్తరించాయని ఆయన కొనియాడారు.సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాలకు అనుబందంగా ఏర్పాటు చేసిన పాలియోటివ్ కేర్ (స్వాంతన చికిత్సా కేంద్రం)ను ఆయన సోమవారం ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలికవ్యాధులతో అవస్థలు పడుతూ అవసాన దశకు చేరుకున్న వారికి ఈ కేంద్రంలో చికిత్సలు అందిస్తారన్నారు.ఇందులో చేరి చికిత్సలు పొందిన మీదట ఇంటికి వెళ్లిన వారికి కుడా అవసరమైతే హోంకేర్ చికిత్సలు అందిస్తారని తెలిపారు.అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఆశా వర్కర్ల ద్వారా ఎనిమిది లక్షల 65 వేల 365 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 25 వేలా 335 మందికి స్వాంతన కేంద్రంలో చికిత్సలు అవసరమని తేలిందన్నారు.హౌంకేర్ చికిత్సల నిర్వహణకు గాను ప్రత్యేక వాహనం వైద్యబందాన్ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్రావు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జెడ్పీ వైస్చైర్మెన్ వెంకట్నారాయణగౌడ్, జెడ్పీటీసీ జీడీ భిక్షం, కలెక్టర్ వినరు కష్ణారెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్రెడ్డి పాల్గొన్నారు.