Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు బారులు తీరారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడానికి గల కారణం ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాలన అంశాలలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన వ్యవహరిస్తుండటంతో కలెక్టర్ దగ్గరికి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ప్రజావాణికి ఎక్కువ సంఖ్యలో హాజరైనట్టు జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రజావాణిలో ప్రజల నుంచి 57 దరఖాస్తులు అందినట్లు పౌరసంబంధాల అధికారి వెల్లడించారు. రాజంపేట మండలం చల్లూరు గ్రామం లో ప్రభుత్వ స్థలాన్ని 30 మంది నిరుపేద ముస్లిం కుటుంబాల కేటాయించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. భువనగిరి పట్టణానికి చెందిన బుచల సరళ తన భర్త ఇటీవలనే చనిపోవడంతో తనకు బ్రతుకు దెరువు లేదని, తాను బిఈడి పూర్తిచేసినట్లు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్ నుకోరారు. రాజాపేట సర్పంచ్ ఉద్దేశపూర్వకంగానే తమ భూమిలోనికి మురుగు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ అతనిపై చర్య తీసుకోవాలని కోరుతూ బాధితుడు సందిల బాలరాజు ఫిర్యాదు చేశారు.