Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజలు జిల్లా నలు మూలల నుండి వివిధ సమస్యలపై వచ్చి ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందచేసిన దరఖాస్తులను స్వీకరించి అర్హత మేరకు పరిష్కార దిశగా సంబంధిత అధికారులకు పంపించామన్నారు.ఎక్కువగా భూసంబంధిత దరఖాస్తులు 30, రైతుబంధు, పంట రుణాలు 2, పరిశ్రమల శాఖ 1, వైద్య శాఖ 1, రెండు పడకల గదులకు సంబం ధించిన దరఖాస్తు ఒకటి అందాయన్నారు.ఆ దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జ్యోతి పద్మ,డీఎస్ఓ విజయలక్ష్మీ, ఏఓ శ్రీదేవి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.