Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
అనారోగ్యంతో బాదపడుతున్న దుబ్బాక గ్రామపంచాయతీ పరిధిలోని ర్రొంటకోలు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు భిక్షం రెడ్డిని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి, నాయకులు మామిడి వెంకట్రెడ్డి, యాదాసు యాదయ్య పరామర్శించారు. మనోధైర్యంతో ముందుకు సాగాలని పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పరామర్శించిన వారిలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు ఉన్నారు.
రామన్నపేట ఎస్ఐగా వెంకటయ్య
నవతెలంగాణ- రామన్నపేట
రామన్నపేట నూతన ఎస్ఐగా సి.వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో బోనాల పండుగను నిర్వహించుకోవాలని కోరారు. స్థానిక పోలీసు సిబ్బంది ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.