Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోటకొండూర్
యాదగిరిగుట్ట కోఆపరేటివ్ బ్రాంచ్ పరిధిలో మార్టిగేజ్ లోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యాదగిరిగుట్ట కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ కావ్య తెలిపారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించి మాట్లాడారు. ఎకరానికి రూ.2 లక్షల చొప్పున లోన్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వీటితో పాటు ఎడ్యుకేషన్, హౌసింగ్, ట్రాక్టర్లు, బర్రెలు, గొర్రెలు వంటి పథకాలను రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మెన్ ఎగ్గిడి బాలయ్య, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, సీఈవో భద్రారెడ్డి, ప్రదీప్, వెంకటేష్, బాలకృష్ణ, బాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.