Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటరూరల్
సూర్యాపేట రూరల్ ఎస్సై తనను దుర్భాశాలాడుతూ వేధిస్తున్నారని మండలంలోని రాజనాయక్తండా సర్పంచ్ లోనావత్ అశోక్నాయక్ ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని రాజనాయక్తండాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ ఎస్సై లవకుమార్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. తాను గ్రామానికి బాధ్యుడినని..ఎస్సైకు కాదని స్పష్టం చేశారు. సూర్యాపేట రూరల్ పోలీసుల ప్రవర్తనతో తండా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ పాండు నాయక్ కొంతకాలంగా పోలీసులను అడ్డుపెట్టుకుని తమపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.