Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలకు పోవడానికి వీలు లేదని ప్రయాణం వద్దు ప్రాణం ముద్దు అని తహసీల్దార్ గణేష్ నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని కొలనుపాక గ్రామం నుండి ప్రవహించే పెద్దవాగు ,అదేవిధంగా గొలనుకొండ నుండి ప్రవహిస్తున్న బికేర్ వాగులో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులను పోలీసు సిబ్బందితో బంద్ చేయించారు. గ్రామంలో ఉండే రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నవీన్ ,విజరు ,లక్ష్మి , విజయ , హమీద్, పిఎ సి ఎస్ డైరెక్టర్ బిక్షపతి, వీఆర్వో యాదగిరి ,వి ఆర్ ఏ పరశురాములు పాల్గొన్నారు.