Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండలస్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు బక్కా శ్రీనివాసచారి అన్నారు.ఈ విషయమై మంగళవారం మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఉపాధ్యాయదినోత్సవాన్ని మండలస్థాయిలో నిర్వహించాలన్నారు.అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విషయంలో నిబంధనలను పాటిస్తూ ఉపాధ్యాయుల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచే విధంగా కార్యాచరణ చేయాలని కోరారు.ఈ కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శి మోర్తాల శ్రీనివాస్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు జి.లచ్చయ్య, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అడావట్ చినవెంకన్న, పాల్వాయి శ్రీనివాస్, కట్లమధుసూదన్, తన్నీరు నాగరాజు, బొజ్యా నాయక్, శ్రీనివాసనాయుడు, పులి సత్యనారాయణ, కె.నాగయ్య పాల్గొన్నారు.