Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండలంలో రెవెన్యూ శాఖలో మెరుగైన సేవలు అందించినందుకుగాను జిల్లాస్థాయిలో ఉత్తమ తహసీల్దార్గా అవార్డు పొందిన పీఏపల్లి తహసీల్దార్ పొడపొంగి రాధకు స్థానిక డోకూరి గార్డెన్స్లో స్వేరో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.నార్కట్ పల్లి మండలంలో ఉత్తమ సేవలందించిన ఆమె బదిలీపై పెద్దఅడిశర్లపల్లికి బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా ఆమెకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఆమె చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కష్ణ, అక్షర అనాథాశ్రమం కోఆర్డినేటర్ మేదరి కిరణ్కుమార్, మేడిరమేష్, కొమ్ము గిరి, రాందాసు పాల్గొన్నారు.