Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
నవతెలంగాణ - అనంతగిరి
తండ్రి చనిపోతే కూతురు తలకొరివి పెట్టిన సంఘటన మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యలమంచి వెంకట నారాయణరావు (91)కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. నారాయణరావు అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకులు ఎవరూ లేక పోవడంతో పెద్ద కుమార్తె శశిరేఖ తండ్రి చితికి నిప్పంటించి తల కొరివి పెట్టింది.