Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై గుండ్రాతి సతీష్ కోరారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకవద్దని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండొద్దని, పిడుగులు పడుతున్నపుడు చెట్ల కిందకు వెళ్లొద్దని, తదితర సూచనలు అందించారు. వాగులను దాటొద్దని, చేపల వేటకు వెళ్లొద్దని కోరారు. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 100కు ఫోన్ చేయాలని కోరారు.