Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయంలో నూతనంగా రూ. 516లు రుసుంతో ప్రవేశపెట్టిన వేద ఆశీర్వచనంను శుక్రవారం ఆలయ ఇన్చార్జ్జి ఈఓ గీతారెడ్డి ప్రారంభించారు. మొదటి టికెట్తో ఆమె పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు.
ఏకాదశి పూజలు
శ్రావణ శుక్రవారం ఏకాదశి కావడంతో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. శ్రావణ మాసం పురస్కరించుకొని చివరి శుక్రవారం కావడంతో కొండకింద సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఉచితంగా చేయించే సదుపాయాన్ని కల్పించారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి సందర్శన
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మోరేశ్వర్ పాటిల్ యాదాద్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.