Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని మేల్కొల్పే బాధ్యత కవులు, రచయితలపై ఉందని డీఎస్పీ రవి కుమార్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి సాహితీ వేదిక ఆధ్వర్యంలో స్థానిక సీఐ కార్యాలయంలో లొట్టపీసు పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి కథలు రాయడం అభినందనీయమన్నారు. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలకు చైతన్యం కల్పించేలా కథలు, వ్యాసాలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాహితీ వేదిక కన్వీనర్ గుండగాని శ్రీనివాస్, సభ్యులు హరికిషన్, తొట్ల సుధాకర్, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.