Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చండూర్
ప్రమాదవశాత్తు గుంతలు పడి బాలుడు మతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని ఇడికూడా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ...అదే గ్రామానికి చెందిన వట్టికోటి హరీష్ కుమారుడు బద్రి(6) తన తాతా వ్యవసాయ బావి వద్దకు బైక్ పై కుర్చోబెట్టుకొని తన పొలం దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో బైకు ఆపి తన పనిలో నిమగమయ్యాడు తాత. బాలుడు పక్కనే ఉన్న కుంట ను చూసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కుంటలో పడిపోయాడు. ఆ తర్వాత తాత గమనించి గుంతలో బుడగలు చూసి ఆ బాలుడు బయటికి తీశారు. దీంతో బాలుడు అక్కడికక్కడే మతి చెందినట్టు తెలిపారు.