Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజావాణికి 86 దరఖాస్తులు
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించేందుకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చారు. జిల్లావ్యాప్గంగా 86 దరఖాస్తులను కలెక్టర్కు అందజేశారు. ప్రజావాణికి అందిన ఫిర్యాదులపై అధికారులు స్పందించి సత్వరమే పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. పిర్యాధుల్లో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు ధరణీ వెబ్సైట్ పై, పింఛన్, నిరుద్యోగ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షణ అధికారి నాగేశ్వర చారి పాల్గొన్నారు.