Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
సూర్యాపేట జిల్లా జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్రెడ్డిని విధుల నుంచి తొలగించడం సరికాదని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని విద్యానగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీ సీఈవో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల గురించి వాస్తవాలు మాట్లాడారని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ విద్యావిధానాన్ని కాపాడాలని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తే ఆయన్ను విధుల నుంచి తొలగించడం ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో లింగయ్య, హఫీజ్, శ్రీనాధ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.