Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
మండలంలోని ఓగోడు గ్రామంలో జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కంపెనీ చైర్మెన్ వినోద్లహోటి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయానికి రైతుల్ని ప్రోత్సహి ంచడంలో తమ కంపెనీ ముందుం టుందన్నారు.జియోలైఫ్ కంపెనీ సంపూర్ణ పోషకాల ప్యాకేజీనీ ఉపయోగించడం ద్వారా అత్యధిక దిగుబడులను పొందవచ్చన్నారు. అనంతరం విగర్ను వాడడం వల్ల అత్యధిక దిగుబడులు పొందడంపై వివరించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ మేనేజర్ పర్వతనేని శ్రీనివాసరావు, రాజేందర్ ఏజెన్సీస్ ప్రొప్రైటర్, కంపెనీ డీలర్ దాసరి రాజేంద్రకుమార్, ఉభయ రాష్ట్రాల ప్రతినిధి జయలక్ష్మి బొప్పన, రీజినల్ మేనేజర్ పోట్ల శ్రీనివాస్, సాంకేతికనిపుణులు ఎండి ఆసిఫ్ఖాన్, రైతులు పాల్గొన్నారు.