Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
క్యాన్సర్పై ప్రతిమహిళకూ అవగాహన అవసరమని రోటరీ క్లబ్ చైర్మన్ డాక్టర్ చతుర్వేద అన్నారు.ఆదివారం పట్టణంలోని దోనియాల గ్రామానికి చెందిన అబ్బనబోయిన శ్రీనివాస్యాదవ్ తల్లి తండ్రి జ్ఞాపకార్ధంగా మండలకేంద్రంలో క్యాన్సర్పై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ చతుర్వేద మాట్లాడారు. క్యాన్సర్పై అవగాహన, నిర్దారణ, నివారణ, నిర్మూలన అనే అంశాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు.క్యాన్సర్ వచ్చి ఏండ్లవుతున్నా పరీక్షలు చేయించుకోకుండా చాలా మంది మహిళలు తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారన్నారు.ఈ సందర్భంగా 80 మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.వారికి సలహాలు,సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భవాని, డాక్టర్ శ్రీకాంత్, శిబిరం నిర్వాహకులు అబ్బనబోయిన శ్రీనివాస్యాదవ్, మహిళలు పాల్గొన్నారు.