Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు ప్రజావాణిలో అందచేసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నలు మూలల నుండి వివిధ సమస్యలపై వచ్చి ప్రజావాణిలో అందచేసిన దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేయడం జరిగిందని అన్నారు. వివిధ రకాల భూ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు అందాయన్నారు. ప్రజావాణిలో భూసమస్యల దరఖాస్తులు 46, సదరం క్యాంప్ 4,ఆసరా పింఛన్ 1,వ్యవసాయ ట్రాక్టర్ 1, ఆర్టీఐ3, పురపాలక 1, రుణమాఫీ 1, వైద్య 4, ఉద్యోగాలు 3, రేషన్ కార్డు 1, మొత్తం 65 దరఖాస్తులు అందా యన్నారు. దరఖాస్తులను వారి యొక్క అర్హత మేరకు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని సూచించా మన్నారు.ఈ కార్యక్రమంలో డీఏఓ రామారావునాయక్, డీపీఓ యాదయ్య, సీపీఓ వెంకటేశ్వర్లు, ఏఓ శ్రీదేవి, పర్యవేక్షకులు సుదర్శన్రెడ్డి, వివిధశాఖల అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.