Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశయానికి 78,158 క్యూసెక్కుల వరద కొనసాగుతుండడంతో డ్యామ్ క్రష్ట్ 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని డ్యామ్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.దీంతో సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 590.00 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వసామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 312.0450 టీఎంసీలుగా ఉంది.ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 26,659 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, ఎడమ కాల్వ 8718 క్యూసెక్కుల ,కుడికాల్వ ద్వారా 8831 క్యూసెక్కుల నీటిని,లోలెవల్ కెనాల్ ద్వారా 150 క్యూసెక్కులు ,మొత్తం 78,158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.