Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
ప్రతి నెల మొదటి వారంలో ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లు ఈ నెల 20 రోజులు గడిచినా ఇవ్వకపోవడం వల్ల దాని మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇక ఆసరా ఆగినట్లేననే అనుమానం ప్రజల్లో కలుగుతుందని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ నెల పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ శాఖ కార్యదర్శి ఎడ్ల సైదులు, నాయకులు కోదాటి సైదులు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, గుర్రం ఏసు పాల్గొన్నారు.