Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు కళాకారులు సిద్ధం కావాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ పిలుపునిచ్చారు . గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ప్రజానాట్యమండలి జెండాను జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి చింతల విజయ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కట్ట నరసింహ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా కళాకారులు సిద్ధం కావాలని పాటల ద్వారా ఆటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమంలోకి తీసుకు రావాలని కోరారు. కళాకారులకు కరోన పరిస్థితుల్లో ఆదరణ కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు గురయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 28,29,30,తేదీలలో సూర్యపేటలో జరిగే ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ కార్యదర్శివర్గ సభ్యులు అమనగాంటి ఐలయ్య, పుట్టల సైదులు, మందుల యాదయ్య, మద సైదులు, దండు శంకరు సిరసంగి రజిత దండు శైలజ గాదెపాక లలిత, గడ్డం గురుమూర్తి, వరికుప్పల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.