Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిలుకూరు
మిషన్ భగీరథ పథకం ద్వారా వస్తున్న నీరు తాగి గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వేనేపల్లి వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం కింద వేసిన పైపులు పగిలి నీరు లీకేజీ అవుతుందన్నారు. ఆ నీరు కలుషితమై గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి లీకేజీలను అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో బత్తిని వెంకటయ్య, నాగాటి చినరాములు, ఎగడి లింగయ్య, నారసాన్ని వెంకటేశ్వర్లు, పిల్లి వీరమల్లు, బుడిగే రామారావు పాల్గొన్నారు.