Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోత్కూరు: ఏరియా వెటర్నరీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మోత్కూర్ ఏడీ మోతీలాల్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని పశువుల సంతలో రూ.16.70 లక్షలతో నిర్మిస్తున్న ఏరియా వెటర్నరీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పనులు నాణ్యతగా చేసి భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. భవన నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయించారని తెలిపారు. కాంట్రాక్టర్ ఇప్పటి వరకు చేసిన పనులకు రూ.8.40 లక్షలకు బిల్ పంపగా ఇంకా మంజూరు కాలేదన్నారు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీ,షెడ్లు, భవనంపైన సమావేశం హాల్ నిర్మాణం కోసం తుంగతుర్తి ఎమ్మేల్యే గాదరి కిశోర్కుమార్ను మరోరూ.10 లక్షల నిధుల మంజూరు కోసం కోరగా ప్రతిపాదనలు పంపాలని చెప్పారన్నారు.