Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు రానింగా హేమంత్ ఇటీవల అనారోగ్యంతో మతి చెందారు. ఆదివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణ అవసరాల నిమిత్తం రూ. 20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్, మండల అధ్యక్షుడు నకిరేకంటి యేసుపాదం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పన్నాల రాఘవ రెడ్డి, భూతుకూరి వెంకట్ రెడ్డి , ఎండి.యూసుఫ్ , పందిరి సతీష్ ఉన్నారు.