Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరి
తుఫాన్ వల్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలం లోని అనంతారం గ్రామం నుంచి వెళ్లే బిక్కేరు వాగును సోమవారం తహసీల్దార్ సంతోష్ కిరణ్ పరిశీలించారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎవరూ వాగులోకి వెళ్లొద్దని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్ చాగంటి అనసూర్యరాములు, ఐబీ ఏఈ అమర్, ఆర్ఐ నరేష్, మున్సిపల్ సూపర్ వైజర్ లక్ష్మణ్ ఉన్నారు.