Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడ్డగుడూర్
కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకులకే తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా స్థానం కల్పించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొలబోయిన లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పార్టీ కార్యకర్తలను కాపాడుతూ అండగా నిలుస్తూ నాలుగు పర్యాయాలు శాసనసభ్యులుగా వివిధ మంత్రిత్వ శాఖలలో కొనసాగుతూ పార్టీని బలోపేతం చేశారన్నారు. అధిష్టానం అద్దంకి దయాకర్కు రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా స్థానం కల్పించినప్పటికీ ఓడిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పుల నిరంజన్ రెడ్డి , డీసీసీ కార్యదర్శి నిమ్మనగోటి జోజి ,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ , కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడెపు పాండు , ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు పొలపాక అబ్బులు , సీనియర్ నాయకులు బాలెంల సురేష్ ,బోడ యాదగిరి ,నర్సిరెడ్డి , యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చెడే మహేందర్ , గుడెపు నాగరాజు ,కప్పల రాజేష్ ,గుగ్గిళ్ల భరత్ ,తదితరులు పాల్గొన్నారు.