Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
గులాబ్ తుఫాన్తో సోమవారం కురిసిన భారీ వర్షాలకు మండల పరిధిలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పట్టణంలోని పెద్దచెరువు అలుగు పారడంతో నీళ్లు రహదారిపై నుండి వెళ్లడంతో అనంతగిరి మండలానికి వెళ్లడానికి రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. మండలపరిధిలోని రామలక్ష్మీపురం, భీక్యాతండాకు వెళ్లే రహదారి మధ్యలో వాగు ఉధతంగా ప్రవహించడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.అదేవిధంగా కూచిపూడి గ్రామ సమీపంలో ఉన్న వాగు ఉధతంగా ప్రవహిస్తుంది.ఉధతంగా ప్రవహిస్తున్న వాగులోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.