Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రముఖ కవి, రచయిత సాగర్ల సత్తయ్య
నవతెలంగాణ -నల్లగొండ
విశ్వ మానవ శ్రేయస్సు కోసం విశాల హృదయాన్ని ఆవిష్కరించిన సామాజిక విప్లవ కవితామూర్తి విశ్వనరుడు, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని ప్రముఖ కవి, రచయిత సాగర్ల సత్తయ్య అన్నారు. కేవీపీఎస్ అధ్వర్యంలో మంగళవారం ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున అధ్యక్షతన గుర్రం జాషువా 126 వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునికులైన పద్య కవులలో అగ్రశ్రేణి కవి జాషువా అన్నారు. భావ కవిత్వం ఉద్యమంగా సాగుతున్న రోజులలో భావ కవిత్వాన్ని కాదని సామాజిక సంస్కరణాభిలాషతో కవిత్వాన్ని రాసిన ధీశాలి జాషువా అన్నారు. 19వ శతాబ్దం లోనే సమాజంలోని కుల వివక్షను ఎదిరించి కులాంతర వివాహం చేసుకొని కులం కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడన్నారు. ఎదురైన అవమానాలను సవాలు గా తీసుకొని తన కలంతో సమాజంలోని దురాచారాలపై తిరుగుబాటు చేశాడన్నారు. ఈ విధంగా కుల వ్యవస్థను హెచ్చుతగ్గులు నిచ్చెనమెట్ల సమాజాన్ని వర్ణవ్యవస్థను జాషువా తీవ్రంగా నిరసించాడు. చరిత్ర ఆధ్యాపకులు లింగమూర్తి మాట్లాడుతూ జాషువా తనకు జరిగిన అవమానాలకు పనితోనే.సమాధానం చెప్పేవారు అన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ,భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ లాంటి ఉన్నత పురస్కారాలు అందుకున్న ఘనత జాషువాది అన్నారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండేటి శ్రీను , పాలడగు నాగార్జున మాట్లాడుతూ జాషువా కులాన్ని నిరసించాడేగానీ కులవాదిగా మారలేదన్నారు. అతని కవిత్వం లో బాష భావం జమిలిగా నడుస్తూ పాఠకులను వెంట తీసుకెళ్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కవి రచయిత డాక్టర్ లేఖనందస్వామి , యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. వెంకులు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య , ఇంద్షురు సాగర్ సీపీఐయంయల్ జిల్లా నాయకులు మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్ , ప్రముఖ కవులు బండారు శంకర్,దేవాదానం, సంతపురి నారాయణ రావు, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పర్శరాములు ,జిట్టా నగేష్ ,పనికర కష్ణమోహిని , గాదె నర్సింహ, బొట్టు శివకుమార, దోంతాల నాగార్జున , బొల్లు రవీందర్, అజరు కుమార్, దండు రవి , బొంగరాల వెంకులు, దైదా జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.