Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పై ప్రగతి , మౌలిక వసతులు, సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ నుండి డాక్టర్ గన్ శ్యామ్ అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్, నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కే చంద్రశేఖర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నామిని ప్రశాంతి , ప్రభుత్వ మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాపోలు శ్రీనివాస్, ఎంకెఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దేవరకొండ ప్రిన్సిపాల్ రామరాజు, కేఎంఎం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మిర్యాలగూడ రుక్సానా, డిగ్రీ కళాశాల నకిరేకల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల చండూరు ప్రిన్సిపాల్ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.