Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ- నల్లగొండ
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, భూ తగాదాలు శాంతి భద్రతల సమస్యగా మారకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని డీఐజీ ఏవి.రంగనాథ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రకరకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సంబందిత పోలీస్ అధికారులకు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫోన్ లో ఆదేశించారు. భూ సమస్యలు అధిక సంఖ్యలో వస్తున్న క్రమంలో వాటిపై ప్రత్యేక దష్టి పెట్టడంతో పాటు శాంతి భద్రతల సమస్యగా మారకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.