Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
అక్రమంగా నిల్వ చేసిన పది క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన మండలపరిధిలోని సింగారెడ్డిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ బత్తిని శ్రీకాంత్గౌడ్ ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన తాడూరి సతీష్ తండ్రి కోటాచారి.వృత్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ పది క్వింటాళ్ల 75 కేజీల పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ ఉంచుకున్నాడనక్న విశ్వసనీయ సమాచారంతో ఎస్సై తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.దాడుల్లో బియ్యాన్ని పట్టుకున్నారు.సతీష్పై కేసు నమోదు చేశారు.ఆయన వెంట ట్రైనీ ఎస్సై ఝాన్సీరాణి, కానిస్టేబుళ్లు ఉన్నారు.